కొవిడ్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో నైపుణ్యశిక్షణ

ABN , First Publish Date - 2020-08-13T07:28:24+05:30 IST

కొవిడ్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో నైపుణ్యశిక్షణ

కొవిడ్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో నైపుణ్యశిక్షణ

అమరావతి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఆన్‌లైన్‌ ద్వారా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు ఏపీఎ్‌సఎ్‌సడీసీ ఛైర్మన్‌ చల్లా మధుసూదన్‌రెడ్డి, సీఈవో అర్జా శ్రీకాంత్‌ తెలిపారు. ఇంజనీరింగ్‌, పాలిటెక్నిక్‌ పూర్తిచేసినవారు, చదువుతున్నవారికి మెషిన్‌ లెర్నింగ్‌, డాటా అనాలసిస్‌, సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, డ్రోన్‌ టెక్నాలజీ, గేమింగ్‌ తదితర 26 కోర్సుల్లో శిక్షణ ఉంటుందన్నారు. ఈ నెల 15వ తేదీలోపు ఏపీఎ్‌సఎ్‌సడీసీ.ఇన్‌ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఈ నెల 17వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని బుధవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2020-08-13T07:28:24+05:30 IST