ఛత్తీస్‌గడ్‌లో ఎన్‌కౌంటర్‌

ABN , First Publish Date - 2020-08-13T07:29:31+05:30 IST

ఛత్తీస్‌గడ్‌లో ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్‌గడ్‌లో ఎన్‌కౌంటర్‌

నలుగురు మావోయిస్టుల మృతి 


చింతూరు, ఆగస్టు 12: ఛత్తీ్‌సగఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. సుక్మా జిల్లాలో బుధవారం ఈ ఘటన జరిగింది.  జేగురుగొండ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారన్న సమాచారం అందడంతో 223 సీఆర్‌ిపీఎఫ్‌ జవాన్లు, 201 కోబ్రా బెటాలియన్‌తో పాటు డిస్ట్రిక్ట్‌ రిజర్వుడు ఫోర్సు సంయుక్తంగా కూంబింగ్‌ చేపట్టాయి. చింతల్‌నార్‌, జేగురుగొండ నడుమ అటవీ ప్రాంతంలో బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరుపక్షాల నడుమ ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు బస్తర్‌ ఐజీ పి.సుందర్‌రాజ్‌ పేర్కొన్నారు. మిగిలిన మావోయిస్టులు తప్పించుకున్నట్లు అధికారులు తెలిపారు. సంఘటనా స్థలంలో బర్మార్‌ తుపాకులు మూడు, ఒక 303 తుపాకీ లభ్యమైందని ఐజీ పేర్కొన్నారు.

Updated Date - 2020-08-13T07:29:31+05:30 IST