వచ్చే నెల 5నుంచి స్కూళ్లు తెరిచే యోచన: సురేష్
ABN , First Publish Date - 2020-08-13T07:28:08+05:30 IST
వచ్చే నెల 5నుంచి స్కూళ్లు తెరిచే యోచన: సురేష్
ఒంగోలు (కలెక్టరేట్), ఆగస్టు 12: రాష్ట్రంలో సెప్టెంబరు ఐదో తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలన్న యోచనలో ఉన్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. ఒంగోలులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అన్లాక్-3 నిబంధనలు ఈనెల 31వ తేదీ వరకూ అమలులో ఉంటాయని, తర్వాత పరిస్థితిని సమీక్షించి స్కూళ్ల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అక్టోబరు 15 నుంచి ఉన్నత విద్యాసంస్థలు ప్రారంభిస్తామన్నారు.