వీసీల నియామకంతో
ABN , First Publish Date - 2020-11-28T09:46:52+05:30 IST
‘‘రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకం ద్వారా జగన్ తన కుల గజ్జిని మరో సారి నిరూపించుకున్నారు.
జగన్ కులగజ్జి స్పష్టం: టీడీపీ
అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకం ద్వారా జగన్ తన కుల గజ్జిని మరో సారి నిరూపించుకున్నారు. అన్ని ప్రధాన విశ్వవిద్యాలయాలకు తన వర్గానికి చెందిన వారినే నియమించుకున్నారు. జగన్ పాలన మేడిపండులా ఉంది’’ అని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు ఎద్దేవా చేశారు. ఎలాంటి రిమార్క్ లేని 60 మంది కమ్మ వర్గానికి చెందిన డీఎస్పీలకు పోస్టింగ్లు ఇవ్వకపోవడాన్ని మాణిక్యాలరావు ప్రశ్నించారు. ‘‘గతంలో చంద్రబాబు హయాంలో వీసీలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చారు. జగన్ మాత్రం వీసీ పదవుల పందేరంలో సామాజిక న్యాయాన్ని అటకెక్కించారు’’ అని టీఎన్ఎ్సఎ్ఫ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ విమర్శించారు.
మానవత్వం మరిచి
ఎస్సీ రైతులకు సంకెళ్లు: లోకేశ్
‘‘రాజధాని గ్రామాల్లోని కృష్ణాయపాలెంలో ఎస్సీ రైతులకు జగన్ ప్రభుత్వం మానవత్వం మరిచి సంకెళ్లు వేసి జైల్లో పెట్టింది. ఫిర్యాదు వెనక్కు తీసుకున్నా రైతులకు సంకెళ్లు వేయించడం జగన్రెడ్డి శాడిజానికి పరాకాష్ఠ’’అని టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు.