నాస్తికత్వం మానవవాదానికి మార్గం: సమరం

ABN , First Publish Date - 2021-01-18T09:14:54+05:30 IST

నాస్తికత్వం మానవవాదానికి మార్గమని, ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని అది ప్రేరేపిస్తుందని ప్రముఖ రచయిత, వైద్యుడు డాక్టర్‌ సమరం అన్నారు.

నాస్తికత్వం మానవవాదానికి మార్గం: సమరం

ఒంగోలు (కల్చరల్‌), జనవరి 17 : నాస్తికత్వం మానవవాదానికి మార్గమని, ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని అది ప్రేరేపిస్తుందని ప్రముఖ రచయిత, వైద్యుడు డాక్టర్‌ సమరం అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరుగుతున్న హేతువాద సంఘం రాష్ట్ర మహాసభల్లో రెండోరోజైన ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు.  సంఘ రాష్ట్ర అధ్యక్షుడు నార్నె వెంకటసుబ్బయ్య అధ్యక్షతన జరిగిన సభలో ప్రజా నాట్యమండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు (అన్న), నరసం రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు తేళ్ల అరుణ, డాక్టర్‌ విజయరాఘవరావు, సంఘ ఒంగోలు నగర అధ్యక్షుడు డి. తిరుపతి పాల్గొన్నారు. అనంతరం రాబోయే రెండేళ్లకు సంఘ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా నార్నె వెంకటసుబ్యయ్య తిరిగి ఎన్నికయ్యారు.  ఉపాధ్యక్షుడిగా రాచపాళెం రఘు, ప్రధాన కార్యదర్శిగా జె.వి. కృష్ణయ్య, సంయుక్త కార్యదర్శిగా ఎం.కె. బేగ్‌, కోశాధికారిగా పి. గంగిరెడ్డి ఎన్నికయ్యారు.

Updated Date - 2021-01-18T09:14:54+05:30 IST