నేడు పింగళి కుమార్తెకు సీఎం సత్కారం
ABN , First Publish Date - 2021-03-12T09:36:11+05:30 IST
నేడు పింగళి కుమార్తెకు సీఎం సత్కారం
మాచర్ల, మార్చి 11: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం మాచర్లకు రానున్నారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మిని ఆయన సన్మానించనున్నారు. జాతీయ జెండాకు రూపకల్పన జరిగి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం తలపెట్టారు. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, ఎస్పీ విశాల్ గున్నీ మాచర్ల పట్టణంలోని సీతామహాలక్ష్మి గృహానికి చేరుకొని కొద్దిసేపు ఆమెతో మాట్లాడారు. సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో హెలికాప్టర్ దిగేందుకు ఏర్పాట్లును పరిశీలించారు.