వాలంటీర్లతో ప్రభుత్వం దుష్ప్రచారం: బొప్పరాజు

ABN , First Publish Date - 2022-01-25T19:49:57+05:30 IST

వాలంటీర్లతో ప్రభుత్వం దుష్ప్రచారం: బొప్పరాజు

వాలంటీర్లతో ప్రభుత్వం దుష్ప్రచారం: బొప్పరాజు

అమరావతి: ఉద్యోగ సంఘాలను ఒకే వేదికపైకి తెచ్చినందుకు ప్రభుత్వానికి పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యమాన్ని తిప్పికొట్టాలని వైసీపీ నేతలకు పిలుపునిచ్చారని చెప్పారు. ప్రభుత్వం చెప్పేదానికి.. చేసేదానికి సంబంధం లేనందుకే ఉద్యమం అన్నారు. అశుతోష్ మిశ్రా నివేదికను బయటపెట్టాలని పలుమార్లు కోరిన పట్టించుకోలేదన్నారు. చీకటి జీవోలు విడుదల చేయడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. హెచ్ఆర్ఏ, సీసీఏ అలవెన్సులు రద్దు చేసే హక్కు మీకుందా? అని ప్రశ్నించారు. వాలంటీర్లతో ప్రభుత్వం తమపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. డీఏలతో గ్రాస్ వేతనం పెరిగిందని ప్రభుత్వం చెప్పడం చూసి ఉద్యోగులు సిగ్గుతో తలవంచుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకొస్తే.. తాము చర్చలకు ముందుకొస్తామన్నారు. 

Updated Date - 2022-01-25T19:49:57+05:30 IST