నేటి నుంచి శంబర జాతర
ABN , First Publish Date - 2022-01-24T12:06:25+05:30 IST
నేటి నుంచి శంబర జాతర
సాలూరు రూరల్/మక్కువ: విజయనగరం జిల్లా మక్కువ మండలం శంబర పోలమాంబ జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 24 నుంచి జాతర ప్రారంభం కానుంది. సోమవారం తొలేళ్లు, మంగళవారం సిరిమానోత్సవం, బుధవారం అంపకోత్సవం జరుగనున్నాయి. జాతరకు అధికారులు కరోనా ఆంక్షల నడుమ ఏర్పాట్లు పూర్తిచేశారు. దర్శనానికి వచ్చే వారికి డబుల్ మాస్క్లు తప్పనిసరి చేశారు. ఏటా పుష్యమాసంలో ధనుర్మాసం ప్రారంభం రోజున పెదపోలమాంబ జాతర ప్రకటించడం.. వారం రోజులు ఘటాలను శంబరలో ఉంచి పూజలు చేయడం.. పెదపోలమాంబ అంపకోత్సవం రోజున పోలమాంబను గ్రామంలోకి తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది.