మెరుగైన ఫిట్మెంట్తో 11వ పీఆర్సీ
ABN , First Publish Date - 2021-10-27T09:14:41+05:30 IST
మెరుగైన ఫిట్మెంట్తో 11వ పీఆర్సీ
సీఎంకు ఉద్యోగుల సంఘం వినతి
అమరావతి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): పదకొండవ పీఆర్సీని మెరుగైన ఫిట్మెంట్తో తక్షణమే అమలుపరచాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేఆర్ సూర్యనారాయణ, ఆస్కారరావు మంగళవారం సీఎం జగన్ను తాడేపల్లిలో కలిసి వినతిపత్రం అందజేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని, బకాయిపడిన 5 ఏడీలను విడుదల చేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు వారు పేర్కొన్నారు.