న్యాయం జరిగేలా చూడండి

ABN , First Publish Date - 2022-02-26T08:13:17+05:30 IST

తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ ఇడుపులపాయ వైఎస్సార్‌ ఘాట్‌లోని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమాధికి ..

న్యాయం జరిగేలా చూడండి

 వైఎస్‌ సమాధికి ట్రిపుల్‌ ఐటీ అధ్యాపకుల వినతి

వేంపల్లె, ఫిబ్రవరి 25: తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ ఇడుపులపాయ వైఎస్సార్‌ ఘాట్‌లోని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమాధికి ఒంగోలు, ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీల్లో పనిచేసే అధ్యాపకులు వినతిపత్రం సమర్పించారు. శుక్రవారం వైఎస్సార్‌ ఘాట్‌కు వెళ్లిన అధ్యాపకులు.. ముఖ్యమంత్రి దృష్టికి తమ సమస్యలు వెళ్లి పరిష్కారం కావాలని సమాధి వద్ద వేడుకొన్నారు. వీరు 2017-18 సంవత్సరంలో ఇంటర్వ్యూల ద్వారా అధ్యాపకులుగా ట్రిపుల్‌ ఐటీల్లో నియామకమయ్యారు. ఏటా రివ్యూ ఇంటర్వ్యూలు పెడుతున్నారని, మిగిలిన అధ్యాపకుల మాదిరిగానే తమకూ రెన్యువల్‌ పద్ధతి పాటించాలని వారు కోరారు. కొందరు అధ్యాపకుల పట్ల ట్రిపుల్‌ ఐటీ అఽధికారులు వివక్ష చూపడం తగదని, ఈ విషయంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చాన్సలర్‌ను పలుమార్లు కలిసి కోరినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

Updated Date - 2022-02-26T08:13:17+05:30 IST