కరోనా కాటు.. వాషింగ్టన్లో ప్రవాసాంధ్రుడు ఎన్ఆర్సీ నాయుడు మృతి
ABN , First Publish Date - 2021-05-16T00:00:48+05:30 IST
అమెరికాలోని వాషింగ్టన్ డీసీకి చెందిన ప్రముఖ ప్రవాసాంధ్రుడు, రాయలసీమ వాసి ఎన్ఆర్సీ నాయుడు(44) శుక్రవారం ఉదయం కరోనాతో కన్నుమూశారు.
వాషింగ్టన్ డీసీ: అమెరికాలోని వాషింగ్టన్ డీసీకి చెందిన ప్రముఖ ప్రవాసాంధ్రుడు, రాయలసీమ వాసి ఎన్ఆర్సీ నాయుడు(44) శుక్రవారం ఉదయం కరోనాతో కన్నుమూశారు. తానాలో క్రియాశీలక పాత్రపోషించిన నాయుడు ప్రస్తుతం తానా స్పాన్సర్షిప్స్ కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన మరణం పట్ల తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, కార్యవర్గ సభ్యులు సంతాపం తెలియజేశారు.