ఏపీని క్రైస్తవ రాష్ట్రం చేస్తున్నారు: శ్రీనివాసానంద

ABN , First Publish Date - 2021-04-11T16:51:34+05:30 IST

ఏపీని క్రైస్తవ రాష్ట్రం చేస్తున్నారని శ్రీనివాసానంద సరస్వతి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

ఏపీని క్రైస్తవ రాష్ట్రం చేస్తున్నారు: శ్రీనివాసానంద

తిరుపతి: ఏపీని క్రైస్తవ రాష్ట్రం చేస్తున్నారని శ్రీనివాసానంద సరస్వతి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ తన బావ ద్వారా మత మార్పిడులు చేయిస్తున్నారని, ఏపీని క్రైస్తవ రాష్ట్రంగా మార్చి ఓటు బ్యాంకు సృష్టించుకుంటున్నారని ఆరోపించారు. శ్రీశైలం అన్యమతస్థుల చేతికి వెళ్లిపోయిందన్నారు. మంత్రి కొడాలి నాని మాటలు హిందువుల మనసులను గాయపరిచాయని, తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రభుత్వానికి హిందువులు బుద్ధి చెప్పాలని కోరారు. హిందుమత రక్షణపై మాట్లాడినందుకు మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంను అవమానకరంగా సాగనంపారని విమర్శించారు. కరోనా సాకుతో సామాన్యులను శ్రీవారికి దూరం చేస్తున్నారని, హిందు ఆలయాలపై దాడులు జరిగినా అరెస్ట్ చేయలేదని శ్రీనివాసానంద సరస్వతి దుయ్యబట్టారు.

Updated Date - 2021-04-11T16:51:34+05:30 IST