అమరావతి: ఎస్ఈసీ తాజా ఆదేశాలు
ABN , First Publish Date - 2021-03-06T15:07:05+05:30 IST
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాజా ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాజా ఆదేశాలు జారీ చేశారు. వార్డు వాలంటీర్లు లబ్ధిదారులకు ఫోన్ చేసి ఓట్లు అడిగితే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎవరైనా కోడ్ ఉల్లంఘిస్తే ఎస్ఈసీ కాల్ సెంటర్ నెంబర్ 0866 2466877కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే ఆయా జిల్లాల కలెక్టర్లకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునన్నారు. అయితే ఫిర్యాదు చేసిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామన్నారు. ఫిర్యాదులపై ఎస్ఈసీ ఎప్పటికప్పుడు స్పందిస్తుందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు.