రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2021-10-21T02:47:11+05:30 IST

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌ పేర్నాటి హేమసుస్మిత రెడ్డి పేర్కొన్నారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరిస్తున్న హేమసుస్మితరెడ్డి, ఎమ్మెల్యే

రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌ హేమసుస్మితరెడ్డి

కావలి రూరల్‌, అక్టోబరు 20: రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌ పేర్నాటి హేమసుస్మిత రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని రుద్రకోటలో బుధవారం విత్తన శుద్ధి నిల్వ గోదాము నిర్మాణానికి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి, వైసీపీ నేత పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డిఓ కలసి ఆమె శంకుస్థాపన చేశారు. రైతుల అభ్యున్నతి కోసం రాష్ట్రంలో 33 ప్రాసెసింగ్‌ యూనిట్లు, గోదాములను మంజూరు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచు లక్ష్మి, ఎమ్పీటీసీ సుజాత, ఏఎంసీ చైర్మన్‌ మన్నెమాల సుకుమార్‌ రెడ్డి, వైసీపీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్‌ రెడ్డి, జడ్పీటీసీ జంపాని రాఘవులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-21T02:47:11+05:30 IST