మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ అరెస్ట్కు ఏపీ సీఐడీ యత్నం
ABN , First Publish Date - 2021-12-21T01:21:40+05:30 IST
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో విచారణను ఏపీ సీఐడీ అధికారులు ముమ్మరం చేశారు. మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ను ...
అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో విచారణను ఏపీ సీఐడీ పోలీసులు ముమ్మరం చేశారు. మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ను అరెస్ట్కు యత్నించారు. హైదరాబాద్లోని ఆయన నివాసానికి సీఐడీ పోలీసులు వెళ్లారు. రమేష్ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగారు. ఒక కంపెనీకి రూ.350 కోట్లు విడుదల చేయడం వెనుక ఎవరైనా ఒత్తిడి చేశారా అనే కోణంలో విచారించనున్నారు. అప్పట్లో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా రమేష్ పని చేశారు. ఒకవేళ ఈ కేసులో రమేష్ను సాక్షిగా చేర్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో పలువురు అధికారులను కూడా ఏపీ సీఐడీ పోలీసులు ప్రశ్నించనున్నారు. అయితే ఏపీ సీఐడీ పోలీసుల తీరుతో రమేష్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.