ప్రత్యేక హోదా పేరుతో ప్రజలను నమ్మించి వంచించింది జగన్రెడ్డి కాదా?: ఆలపాటి
ABN , First Publish Date - 2021-07-21T20:34:04+05:30 IST
ప్రత్యేక హోదా పేరుతో ప్రజలను నమ్మించి వంచించింది జగన్రెడ్డి కాదా? అని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు.
అమరావతి: ప్రత్యేక హోదా పేరుతో ప్రజలను నమ్మించి వంచించింది జగన్రెడ్డి కాదా? అని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2.30 లక్షల ఉద్యోగాల భర్తీతో నిరుద్యోగులు, యువతను.. సీపీఎస్ రద్దు పేరుతో ఉద్యోగులను సీఎం మోసగించారని మండిపడ్డారు. భవిష్యత్ కోసం ఆందోళన చేస్తే అక్రమ కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. యువతపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే తొలగించాలని రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు.