పేదలకు భోజనం పంపిణీ
ABN , First Publish Date - 2021-06-14T05:57:16+05:30 IST
నగరంలోని పేదలకు, అభ్యాగులకు ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్య పోరాట సమితి ఆధ్వర్యంలో ఆదివారం భోజనం అందజేశారు.
గుంటూరు(విద్య), జూన్ 13: నగరంలోని పేదలకు, అభ్యాగులకు ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్య పోరాట సమితి ఆధ్వర్యంలో ఆదివారం భోజనం అందజేశారు. స్థానిక హిందూ కళాశాల సెంటర్ తదితర ప్రాంతాల్లో పేదలకు భోజనం అందజేశారు. కార్యక్రమంలో బీసీ యువజన సంఘం నాయకులు కుమ్మర క్రాంతికుమార్, సంఘం నాయకులు కొల్లికొండ వెంకటసుబ్రమణ్యం, ప్రవీణ్, ప్రవీణ్నాయక్, గౌరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.