ఆర్టీసీ బస్సు ప్రమాదంపై సాకే శైలజానాథ్ స్పందన

ABN , First Publish Date - 2021-12-15T19:45:39+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన బస్సు ప్రమాదంపై ఏపీసీసీ అధ్యక్షులు సాకె శైలజానాథ్ స్పందించారు.

ఆర్టీసీ బస్సు ప్రమాదంపై సాకే శైలజానాథ్ స్పందన

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన బస్సు ప్రమాదంపై ఏపీసీసీ అధ్యక్షులు సాకె శైలజానాథ్ స్పందించారు. బస్సు ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవటం బాధాకరమన్నారు. జల్లేరు వాగులోకి ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురై డ్రైవర్‌తో సహా పలువురు మృతి చెందటం బాధ కలిగించిందని అన్నారు. అక్కడి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో చనిపోయినవారి కుటుంబ సభ్యులకు శైలజనాథ్ ప్రగాడ సానూభూతిని తెలియజేశారు. 

Updated Date - 2021-12-15T19:45:39+05:30 IST