సెప్టెంబరు 19 న ఏపీఈసెట్‌ ప్రవేశ పరీక్ష

ABN , First Publish Date - 2021-08-01T11:55:20+05:30 IST

డిప్లొమా కోర్సులు పూర్తి చేసి, బీటెక్‌ ద్వితీయ సంవత్సరంలో అడ్మిషన్‌ పొందేందుకు నిర్వహిస్తున్న ఏపీఈసెట్‌ షెడ్యూల్‌ ఖరారైంది. శనివారం ఈసెట్‌ కన్వీనర్లు రంగజనార్దన, శశిధర్‌ అనంతపురంలో

సెప్టెంబరు 19 న ఏపీఈసెట్‌ ప్రవేశ పరీక్ష

అనంతపురం: డిప్లొమా కోర్సులు పూర్తి చేసి, బీటెక్‌ ద్వితీయ సంవత్సరంలో అడ్మిషన్‌ పొందేందుకు నిర్వహిస్తున్న ఏపీఈసెట్‌ షెడ్యూల్‌ ఖరారైంది. శనివారం ఈసెట్‌ కన్వీనర్లు రంగజనార్దన, శశిధర్‌ అనంతపురంలో వివరాలను వెల్లడించారు. ఏపీఈసెట్‌కు జూలై 12వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామని, ఇప్పటివరకు 19526 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఈనెల 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రూ.1000 జరిమానాతో 23వ తేదీ వరకు అవకాశం కల్పించామన్నారు. సెప్టెంబరు 19న ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. సెప్టెంబరు 9వ తేదీ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. తెలుగు రాష్ర్టాల్లో 48 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 

Updated Date - 2021-08-01T11:55:20+05:30 IST