ఏపీజీబీ రూ.5వేల కోట్ల వ్యాపారం

ABN , First Publish Date - 2021-09-17T05:06:27+05:30 IST

ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు రూ.5వేల కోట్ల వ్యాపారం చేస్తోందని ఆ బ్యాంకు చైర్మన్‌ రాకేష్‌ కశ్వప్‌ చెప్పారు. నగరంలోని ఆంధ్ర మహాసభలో ఖాతాదారుల సమావేశం గురువారం జరిగింది. ఆయన మాట్లాడుతూ తమ బ్యాంకు అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉందన్నారు.

ఏపీజీబీ రూ.5వేల కోట్ల వ్యాపారం
సమావేశంలో మాట్లాడుతున్న చైర్మన్‌ రాకేష్‌కశ్యప్‌

నెల్లూరు(హరనాథపురం), సెప్టెంబరు 16 : ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు రూ.5వేల కోట్ల వ్యాపారం చేస్తోందని ఆ బ్యాంకు చైర్మన్‌ రాకేష్‌ కశ్వప్‌ చెప్పారు. నగరంలోని ఆంధ్ర మహాసభలో ఖాతాదారుల సమావేశం గురువారం జరిగింది. ఆయన మాట్లాడుతూ తమ బ్యాంకు అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉందన్నారు. అన్ని బ్యాంకుల కంటే అధిక వడ్డీ అందిస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా పలువురికి రుణ మంజూరు లేఖలు అందచేశారు.  ఈ సమావేశంలో ఆర్‌ఎం కోటేశ్వరరావు, చీఫ్‌ మేనేజర్‌ పీవీ రమణ తదితరులు పాల్గొన్నారు. కాగా,  చైర్మన్‌ రాకేష్‌ కశ్వప్‌ మర్యాదపూర్వకంగా కలెక్టర్‌ను బంగ్లాలో కలిశారు.

Updated Date - 2021-09-17T05:06:27+05:30 IST