బాధితులకు ఏపీఎన్ఆర్టీఎ్స ఆర్థిక సాయం
ABN , First Publish Date - 2021-02-27T09:49:49+05:30 IST
విదేశాల్లో మరణించిన ప్రవాసాంధ్రుల కుటుంబాలకు ఏపీఎన్ఆర్టీ సొసైటీ ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం తరఫున ఈ నెల 25న 36 బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.50,000 చొప్పున ఎక్స్గ్రేషియాను
అమరావతి, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): విదేశాల్లో మరణించిన ప్రవాసాంధ్రుల కుటుంబాలకు ఏపీఎన్ఆర్టీ సొసైటీ ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం తరఫున ఈ నెల 25న 36 బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.50,000 చొప్పున ఎక్స్గ్రేషియాను పంపిణీ చేసింది. ఈ సందర్భంగా ఏపీఎన్ఆర్టీఎ్స అధ్యక్షుడు వెంకట్ ఎస్. మేడపాటి మాట్లాడుతూ 2019 జూన్ నుంచి ఇప్పటి వరకు 200 మంది బాధిత కుటుంబాలకు సుమారు కోటి రూపాయల ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. ప్రవాసాంధ్రులకు ఏపీఎన్ఆర్టీఎ్స అందించే సంక్షేమం, అభివృద్ధి సేవల గురించి తెలుసుకునేవారు.. ఏపీఎన్ఆర్టీఎ్స వెబ్సైట్ www.apnrts.ap.gov.in apnrts24/7 హెల్ప్లైన్ 0863 2340678, 8500027678ను సంప్రదించాలని సూచించారు.