అపోలో హాస్పిటల్స్ క్యూఐపీ ఇష్యూ
ABN , First Publish Date - 2021-01-19T05:49:12+05:30 IST
అర్హులైన సంస్థాగత మదుపర్లకు షేర్లను జారీ చేయడం ద్వారా అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ నిధులు సమీకరించనుంది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): అర్హులైన సంస్థాగత మదుపర్లకు షేర్లను జారీ చేయడం ద్వారా అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ నిధులు సమీకరించనుంది. రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరును రూ.2,508.58 ధరతో అర్హులైన సంస్థాగత మదుపర్లకు జారీ చేయనుంది. క్యూఐపీ ఇష్యూ ద్వారా సమీకరించే దాదాపు రూ.1,000 కోట్ల నిధులను రుణ భారాన్ని తగ్గించుకోవడానికి అపోలో హాస్పిటల్స్ వినియోగించనుంది.