పేదలకు ఉచిత కరోనా నిర్ధారణ పరీక్ష
ABN , First Publish Date - 2020-04-03T05:46:26+05:30 IST
కోవిడ్-19 వైరస్ నిర్ధారణ పరీక్షను పేదలకు ఉచితంగా అందించడానికి అపో లో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ అనుబంధ సంస్థ అపోలో హెల్త్ అండ్ లైఫ్స్టైల్, ఐసీఐసీఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్...
- అపోలో హెల్త్, ఐసీఐసీఐ లంబార్డ్ భాగస్వామ్యం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): కోవిడ్-19 వైరస్ నిర్ధారణ పరీక్షను పేదలకు ఉచితంగా అందించడానికి అపో లో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ అనుబంధ సంస్థ అపోలో హెల్త్ అండ్ లైఫ్స్టైల్, ఐసీఐసీఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, మెట్రోపోలిస్ హెల్త్కేర్ చేతులు కలిపాయి. కోవిడ్-19 వైరస్ నిర్ధారణ కోసం జరిగే స్ర్కీనింగ్ ప్రక్రియకు అయ్యే వ్యయాన్ని భరించనున్నట్లు ఐసీఐసీఐ లంబార్డ్డ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ భార్గవ్ దాస్గుప్తా తెలిపారు. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షకు దాదాపు రూ.4,500 అవుతుంది. ప్రారంభంలోనే కరోనా వైరస్ను గుర్తించడం వల్ల వ్యాప్తిని అరికట్టడం సులభం అవుతుందని, పేద వారికి ఇది ప్రయోజనకరమని అపోలో హెల్త్ అండ్ లైఫ్ ఎండీ సంగీతా రెడ్డి తెలిపారు. దీనికోసం ఐసీఐసీఐ లాంబర్డ్ రూ.5 కోట్లు వెచ్చించనుంది.