అప్పన్న దర్శన వేళలు పెంపు
ABN , First Publish Date - 2021-10-18T06:21:07+05:30 IST
వరాహ లక్ష్మీనృసింహస్వామివారి దర్శన వేళలను రెండు గంటలు పెంచుతున్నట్టు ఆలయ ఈవో ఎంవీ సూర్యకళ వెల్లడించారు. సోమవారం నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రాత్రి 9 గంటల వరకు భక్తులకు అనుమతి
కొవిడ్-19 నిబంధనల సడలింపుతో ఈవో నిర్ణయం
18 నెలల తరువాత పాత వేళలు పునరుద్ధరణ
నేటి నుంచి అమలు
సింహాచలం, అక్టోబరు 17: వరాహ లక్ష్మీనృసింహస్వామివారి దర్శన వేళలను రెండు గంటలు పెంచుతున్నట్టు ఆలయ ఈవో ఎంవీ సూర్యకళ వెల్లడించారు. సోమవారం నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కరోనా కారణంగా సుమారు 18 నెలల నుంచి రాత్రి ఏడు గంటల వరకు మాత్రమే భక్తులకు స్వామివారి దర్శనాలు లభించేవి. కరోనా ఉధృతి తగ్గడం, భక్తుల రాక పెరగడంతో వైదిక కమిటీతో చర్చించి ఉన్నతాధికారుల ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు. 18వ తేదీ నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు భక్తులకు దర్శ నాలు లభిస్తాయని పేర్కొన్నారు. స్వామి వారికి వివిధ రకాల సేవలు, ఆరాధనల వేళల్లో భక్తులను అనుమ తించారు. అన్ని సాధారణ రోజుల్లో ఉదయం 6.30 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 12.15 నుంచి 2.30 గంటల వరకు, 3.15 గంటల నుంచి రాత్రి ఏడు వరకు, 8.30 గంటల నుంచి 9.00 గంటల వరకు భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు.