ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆవిర్భావ వేడుకలు
ABN , First Publish Date - 2020-05-31T11:04:19+05:30 IST
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ ఎ.శ్రీదేవసేన అన్నారు. జూన్
సిటీ న్యూస్ : రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ ఎ.శ్రీదేవసేన అన్నారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలను కలెక్టరేట్లో నిర్వహించేందుకు ఏర్పాట్లను శనివారం కలెక్టర్ పరిశీలించారు. కలెక్టరేట్ ఆవరణలోని పార్క్లో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పతాకావిష్కరణ గావిస్తారని తెలిపా రు. కలెక్టరేట్లోని పార్కును శుభ్రపరిచి అవసరమైన ఏర్పాట్లను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
రోడ్లు, భవనాల శాఖ, మున్సిపల్ అధికారులు ఏర్పాట్లను చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, ఎం.డేవిడ్, మున్సిపల్ చైర్పర్సన్ జోగు ప్రేమేందర్, జిల్లా రెవెన్యూ అధికారి నటరాజ్, ఆర్డీవో సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ మారుతిప్రసాద్, రోడ్లు, భవనాల శాఖ డిప్యూటీ ఈఈ సురేష్, కలెక్టరేట్ పరిపాలన అధికారి అరవింద్కుమార్ ఉన్నారు.