రూ. 5 వేల క్యాష్ బ్యాక్ ప్రకటించిన యాపిల్

ABN , First Publish Date - 2021-01-15T22:21:39+05:30 IST

ఆన్‌లైన్‌లో రూ. 44,900 ఆపైన ఆర్డర్ చేసే భారత వినియోగదారులకు యాపిల్ స్టోర్ రూ. 5 వేల క్యాష్ బ్యాక్ ఆఫర్

రూ. 5 వేల క్యాష్ బ్యాక్ ప్రకటించిన యాపిల్

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌లో రూ. 44,900, ఆపైన ఆర్డర్ చేసే భారత వినియోగదారులకు యాపిల్ స్టోర్ రూ. 5 వేల క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. పరిమిత కాలం పాటు అందుబాటులో ఉండే ఈ ఆఫర్ ఈనెల 21న ప్రారంభమై 28తో ముగుస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ ఈఎంలకు మాత్రమే ఇది వర్తిస్తుందని యాపిల్ తెలిపింది. అలాగే, ఆరు నెలల ఈఎంఐకి మాత్రమే నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్ అందుబాటులో ఉన్నట్టు పేర్కొంది. రూ. 44,900తో సింగిల్ ఆర్డర్‌కు కానీ, అంతే మొత్తంలో కొనుగోలు చేసే పలు ఆర్డర్లకు కానీ రూ. 5 క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుందని యాపిల్ పేర్కొంది. ఆఫర్ కనుక మీకు వర్తిస్తే ప్రొడక్ట్ డెలివరీ అయిన తర్వాతి నుంచి వారం రోజుల్లో క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. 

Updated Date - 2021-01-15T22:21:39+05:30 IST