రేపటిలోగా రైతుబీమా పాలసీకి దరఖాస్తు చేసుకోవాలి

ABN , First Publish Date - 2020-08-09T07:48:07+05:30 IST

రైతుబీమా పాలసీకి కొత్తగా దరఖాస్తు చేసుకొనే రైతులు సోమవారం సాయంత్రం వరకు ...

రేపటిలోగా  రైతుబీమా పాలసీకి దరఖాస్తు చేసుకోవాలి

  • రైతుబంధు జిల్లా సమన్యయకర్త నల్లమల వేంకటేశ్వరరావు 

ఖమ్మంవ్యవసాయం, ఆగస్టు8: రైతుబీమా పాలసీకి కొత్తగా దరఖాస్తు చేసుకొనే రైతులు సోమవారం సాయంత్రం వరకు  డాక్యుమెంట్లు వ్యవసాయశాఖ అధికారులకు అందచేయాలని రైతుబంధు జిల్లా సమన్యయకర్త నల్లమల వేంకటేశ్వరరావు ఒక ప్రకటనలో కోరారు. గతంలో దరఖాస్తు చేసి పాలసీ బాండ్‌లో తప్పులున్న వారు కూడా సరిచేయించుకోవచ్చని తెలిపారు. సీఎం కేసీఆర్‌ రైతుబీమా పథకానికి సంబంధించి 2020-21 ఏడాదికి ప్రభుత్వం ఎల్‌ఐసీకి చెల్లించవలసిన రూ.1141కోట్లు విడుదల చేసిందన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకొనేవారు, అలాగే గతంలో పాలసీ పొంది బాండ్లలో తప్పులున్నవారు తమ పట్టాదార్‌ పాస్‌ పుస్తకం, ఆధార్‌కార్డు, నామినీ ఆధార్‌కార్డులతో సోమవారం సాయంత్రం వరకు వ్యవసాయశాఖ ఏవో లేదా ఏఈవోలను సంప్రదించాలని నల్లమల కోరారు.

Updated Date - 2020-08-09T07:48:07+05:30 IST