పాతికేళ్ల ‘ప్రయాణం’!

ABN , First Publish Date - 2021-03-08T09:30:11+05:30 IST

ఏపీఎ‌స్‌ఆర్టీసీలో మహిళా కండక్టర్ల ప్రవేశానికి నేటితో సరిగ్గా 25ఏళ్లు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 1996 మార్చి 8న

పాతికేళ్ల ‘ప్రయాణం’!

1996లో తొలిసారి మహిళా కండక్టర్ల నియామకం 


(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఏపీఎ‌స్‌ఆర్టీసీలో మహిళా కండక్టర్ల ప్రవేశానికి నేటితో సరిగ్గా 25ఏళ్లు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 1996 మార్చి 8న కండక్టర్లుగా మహిళల్ని నియమించాలన్న నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అప్పట్లో రకరకాల చర్చలు జరిగాయి. అయితే ఈ నిర్ణయంతో వందల సంఖ్యలో మహిళలకు ఉద్యోగాలు లభించగా రాష్ట్ర విభజన నాటికి వారి సంఖ్య 8వేలు దాటింది. ప్రస్తుతం 13 జిల్లాల్లో ఏపీఎ్‌సఆర్టీసీలో 5,701మంది మహిళా సిబ్బంది పనిచేస్తుండగా 4,627మంది కండక్టర్లుగా విధుల్లో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పీటీడీ ఎంప్లాయీస్‌ యూనియర్‌ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఈ నెల 8న బస్‌ డిపోలలో ఘనంగా నిర్వహించనున్నట్లు ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర్‌రావు తెలిపారు.

Updated Date - 2021-03-08T09:30:11+05:30 IST