మేడారం జాతర ట్రస్ట్ బోర్డు నియామకం

ABN , First Publish Date - 2022-01-28T00:38:54+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగే గిరిజనుల ఆరాధ్యదైవం

మేడారం జాతర ట్రస్ట్ బోర్డు నియామకం

ములుగు: రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగే గిరిజనుల ఆరాధ్యదైవం సమ్మక్క, సారలమ్మ జాతరకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో (ఫిబ్రవరి) జరిగే జాతర ఏర్పాట్లను పర్యవేక్షించడానికి మేడారం జాతర ట్రస్ట్ బోర్డు కమిటీ మెంబర్లను నియమించింది. 14మందితో కూడిన కమిటీని నియమిస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. 


సభ్యులుగా కోర్నిబెల్లి శివయ్య, సప్పిడి వెంకట్రాంనర్సయ్య, చిలకమర్రి రాజెందర్, లకావత్ చందూలాల్, వట్టం నాగరాజు, బండి వీరాస్వామి, సనికొమ్ము ఆదిరెడ్డి, నక్క సాంబయ్య, జేటీవీ సత్యనారాయణ, తండా రమేష్, పొడెం శోభన్, వద్దిరాజు రవిచంద్ర, అంకం క్రిష్ణస్వామి, సిద్దబోయిన జగ్గారావులను నియమించింది. ఈ నెల 29న దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో కమిటీ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.  

Updated Date - 2022-01-28T00:38:54+05:30 IST