ఐఎన్హెచ్ఆర్సీ నూతన కమిటీల నియామకం
ABN , First Publish Date - 2020-08-03T10:16:43+05:30 IST
భారత జాతీ య మానవ హక్కుల కమి టీ (ఐఎన్హెచ్ఆర్సీ) నూ తన జిల్లా, నియోజక వర్గాల కార్యవర్గ కమిటీలను నియ మించారు.
అనంతపురం అర్బన్, ఆగస్టు 2: భారత జాతీ య మానవ హక్కుల కమి టీ (ఐఎన్హెచ్ఆర్సీ) నూ తన జిల్లా, నియోజక వర్గాల కార్యవర్గ కమిటీలను నియ మించారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జేబీ సురేష్, ప్రధాన కార్యదర్శి కేపీ మధు ఆదివారం నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాటా ్లడుతూ కరోనా నేపథ్యంలోనూ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని వా పోయారు. నూతన కమిటీల సభ్యులు వాటిని అరికట్టేందుకు నిరంతరం కృషి చేయాలని సూచించారు.
జిల్లా కార్యవర్గ గౌరవాధ్యక్షుడిగా నాగ భూషణం, అధ్య క్షుడిగా వరప్రసాద్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అక్కులప్ప, ఉపాధ్యక్షులుగా అంకె కుళ్లాయప్ప, సౌకత్ అలీ, ప్రధాన కార్యదర్శిగా రామాంజనేయుల(తాడిపత్రి), కార్యదర్శిగా రామాంజి (రామ్నగర్), సహాయ కార్యదర్శులుగా సత్యనారాయణ, హనుమంతరావును నియమించారు. అనంతపురం నియోజకవర్గ కార్యవర్గం అ ధ్యక్షుడిగా చంద్ర మహేష్ గుప్తా, ఉపాధ్యక్షులుగా రామకృష్ణమ్మ, మురారి రాము, ప్రధాన కాదర్శిగా శ్రీహర్ష, కార్యదర్శిగా తబ్జుల్ చంద్రశేఖర్, కార్యనిర్వాహక కా ర్యదర్శిగా మాదాలం సురేష్, సహాయ కార్య దర్శిగా ఆశారాణి, కోశాధికారిగా ఇల్లూరు సురేష్, ప్రచార కార్యదర్శిగా సరేంద్ర గుప్తా, మీడియా ఇన్చార్జ్గా రా మాంజనేయులకు నియామక ఉత్తర్వులను అందజేశారు. గుంతకల్లు నియోజవర్గ కార్యవర్గ అధ్యక్షుడిగా ఆలం నవాబ్, ఉపాధ్యక్షులుగా ఖయుమ్ ఖాన్, విజయజ్యో తి, ప్రధాన కార్యదర్శిగా కురుబ నాగేంద్ర, కార్యదర్శిగా విజయ్, సహాయ కార్యదర్శిగా యల్లమ్మ, ప్రచార కార్యదర్శిగా మస్తానయ్యను నియమించారు.