ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక
ABN , First Publish Date - 2022-01-24T05:41:10+05:30 IST
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది.
గుంటూరు, జనవరి 23(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా సీహెచ్వీ సత్యన్నారాయణ(గుంటూరు), ప్రధాన కార్యదర్శిగా ఆచంట వెంకటేశ్వరరావు(పశ్చిమగోదావరి), గౌరవాధ్యక్షులుగా కుర్రి బ్రహ్మారెడ్డి(ప్రకాశం), దాసరి ప్రతాప్కుమార్రెడ్డి(కడప), కార్యనిర్వాహక కార్యదర్శిగా కేవీ రమణారెడ్డి(గుంటూరు), కోశాధికారిగా టీ శ్రీహరిరావు(కృష్ణ), మహిళా కార్యదర్శిగా షేక్ మస్తాన్బి ఎన్నికయ్యారు. వివిధ జిల్లాల నుంచి తొమ్మిది మంది ఉపాధ్యక్షులు, జాయింట్ సెక్రెటరీలను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కట్టా కాళిదాసు పాల్గొన్నారు.