వైసీపీఎస్సీగా ఏపీపీఎస్సీ

ABN , First Publish Date - 2021-06-11T08:53:15+05:30 IST

ఏపీపీఎస్సీని వైసీపీఎస్సీగా మార్చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. గ్రూప్‌-1 పరీక్షపై అ భ్యర్థులు, నిపుణులతో గురువారం ఆయన జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు

వైసీపీఎస్సీగా ఏపీపీఎస్సీ

గ్రూప్‌-1 పరీక్షల్లో అవకతకవలు.. అభ్యర్థులతో సదస్సులో లోకేశ్‌


అమరావతి, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్సీని వైసీపీఎస్సీగా మార్చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. గ్రూప్‌-1 పరీక్షపై అ భ్యర్థులు, నిపుణులతో గురువారం ఆయన జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అక్రమాలు జరిగిన మాట వాస్తవమని, అయినా ప్రభుత్వం దున్నపోతు మీ ద వర్షం ప డినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. గ్రూప్‌-1 పరీక్షల డిజిటల్‌ మూల్యాంకనం ఇతర రాష్ట్రాల్లో ఉందని ప్రభుత్వం చెబుతోందని, ఏ రాష్ట్రంలో ఉందో చెప్పాలన్నారు. గ్రూప్‌-1 జోలికొస్తే ఏ1రెడ్డికి ఎలా బుద్ధిచెప్పాలో తెలుసని, ఎవరూ అధైర్యపడొద్దని అన్నారు. డిజిటల్‌ మూ ల్యాంకనం చేయడం వల్ల అర్హులైనవారు నష్టపోతున్నారన్నారు. ఏపీపీఎస్సీ, డీఎస్సీని గుండు సున్నా చేశారని, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ను నిర్వీర్యం చేశారని విమర్శించారు.   

Updated Date - 2021-06-11T08:53:15+05:30 IST