ఏపీఆర్ సెట్ నిబంధనలు జారీ
ABN , First Publish Date - 2021-08-27T13:52:44+05:30 IST
ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏపీఆర్సీఈటీ)కు అనుసరించాల్సిన నిబంధనలను ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. ఎంఫిల్, నెట్, స్లెట్ అర్హతలు ఉన్నవారిని కేటగిరీ-1గా, పీజీ చేసినవారిని
అమరావతి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏపీఆర్సీఈటీ)కు అనుసరించాల్సిన నిబంధనలను ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. ఎంఫిల్, నెట్, స్లెట్ అర్హతలు ఉన్నవారిని కేటగిరీ-1గా, పీజీ చేసినవారిని కేటగిరీ-2గా పేర్కొన్నారు. మొదటి కేటగిరీ అభ్యర్థులకు 100 మార్కులకు ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో 70మార్కులు రాత పరీక్ష, ఇంటర్వ్యూకి 30మార్కులు ఉంటాయి. కేటగిరీ-2లో 140 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. ఇందులో 70 మార్కులకు రీసెర్చ్ మెథడాలజీపై ప్రశ్నలు, మరో 70 ప్రశ్నలు అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్ట్పై ఉంటాయి. ఇంటర్వ్యూకి 60 మార్కులు ఉంటాయి.