ఇటీవల విడుదలైన సినిమా పైరసీ..
ABN , First Publish Date - 2021-03-07T11:55:23+05:30 IST
పైరసీ చేసిన కేటుగాళ్లు యూట్యూబ్లో అప్లోడ్ చేశారంటూ ..
- సైబర్ క్రైమ్లో దర్శకుడు ఫిర్యాదు
హైదరాబాద్/హిమాయత్నగర్ : ఇటీవల విడుదలైన ‘ఏప్రిల్ 28న ఏంజరిగింది..’ సినిమాను పైరసీ చేసిన కేటుగాళ్లు యూట్యూబ్లో అప్లోడ్ చేశారంటూ సినిమా దర్శకుడు శనివారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం ‘ఏప్రిల్ 28న ఏం జరిగింది’ అనే సినిమాను ఆగంతుకులు పైరసీ చేయడమే కాకుండా యూట్యూబ్లో అప్లోడ్ చేశారని సినిమా దర్శకుడు వీర గనమాల ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ ప్రసాద్ తెలిపారు.