ఏపీటీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు గృహనిర్బంధం

ABN , First Publish Date - 2022-01-21T06:09:46+05:30 IST

ప్రభుత్వం ప్రకటించిన పీఆర్‌సీకి వ్యతిరేకంగా గురువారం ‘చలో కలెక్టరేట్‌’ ఆందోళనలో పాల్గొనేందుకు సిద్ధమైన ఏపీటీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ఎ.శ్యామ్‌సుందర్‌ను పోలీసులు గురువారం తెల్లవారుజాము నుంచి గృహనిర్బంధం చేశారు.

ఏపీటీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు గృహనిర్బంధం
పోలీసుల గృహనిర్బంధంలో ఏపీటీఎఫ్‌ నేతలు శ్యామ్‌సుందర్‌, రామకృష్ణ

‘చలో కలెక్టరేట్‌’కు వెళ్లకుండా నిలువరించిన పోలీసులు


పాడేరు, జనవరి 20: ప్రభుత్వం ప్రకటించిన పీఆర్‌సీకి వ్యతిరేకంగా గురువారం ‘చలో కలెక్టరేట్‌’ ఆందోళనలో పాల్గొనేందుకు సిద్ధమైన ఏపీటీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ఎ.శ్యామ్‌సుందర్‌ను పోలీసులు గురువారం తెల్లవారుజాము నుంచి గృహనిర్బంధం చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని తమ పోరాటాన్ని ఆపలేరని, ఉద్యోగుల డిమాండ్లను ఆమోదించే వరకు ఆందోళనలను ఉధృతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు మరో నేత రామకృష్ణ... ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. 


ఉద్యోగుల పోరాటానికి టీడీపీ మద్దతు: గిడ్డి ఈశ్వరి

పాడేరు, జనవరి 20: పీఆర్‌సీ, ఇతర డిమాండ్లపై ఉద్యోగులు చేస్తున్న ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణమద్దతు తెలుపుతున్నదని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత ఆర్థిక కష్టాలు ఉన్నప్పుడే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చారని, కానీ ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం 23 శాతం మాత్రమే ఇచ్చి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. జగన్‌ నిజస్వరూపం ఏమిటో ఉద్యోగులు ఇప్పటికైనా గుర్తించాలని హితవు పలికారు.


Updated Date - 2022-01-21T06:09:46+05:30 IST