ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం : ఏపీటీఎఫ్‌

ABN , First Publish Date - 2021-04-20T03:45:14+05:30 IST

ఉపాధ్యాయ సమస్యలపై దశలవారీగా పోరాటాలు నిర్వహించనున్నట్లు ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ చేవూరు సుబ్బారావు తెలిపారు

ఉపాధ్యాయ సమస్యలపై  పోరాటం : ఏపీటీఎఫ్‌
వినతిపత్రాన్ని అందచేస్తున్న ఏపీటీఎఫ్‌ నాయకులు

వెంకటాచలం, ఏప్రిల్‌ 19 : ఉపాధ్యాయ సమస్యలపై  దశలవారీగా పోరాటాలు నిర్వహించనున్నట్లు ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ చేవూరు సుబ్బారావు తెలిపారు. ఈ మేరకు సోమవారం వెంకటాచలం తహసీల్దారుకు వినతిపత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. పీఆర్సీ నివేదికను వెల్లడించి 2018 నుంచి అమలు చేయాలని, ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌ ఈ సమస్యను పరిష్కరించాలన్నారు. 20వేలకుపైగా ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో  ఏపీటీఎఫ్‌ మండలాధ్యక్షుడు డి.శ్రీనివాసులురెడ్డి, ప్రధాన కార్యదర్శి జె.నరసింహయ్య, చెన్నయ్య, సుబహాన్‌, సర్థార్‌, రవీంద్ర, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు. 


టీపీ గూడూరులో...


తోటపల్లిగూడూరు, ఏప్రిల్‌ 19 : టీచర్లు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కరించాలని ఏపీటీఎఫ్‌ ప్రతినిధులు  సోమవారం తహసిల్దారుకు వినతిపత్రం అందచేశారు. వారు మాట్లాడుతూ కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి హజరత్‌, మండల గౌరవ అధ్యక్షుడు తోట శ్రీనివాసులు, మండల అధ్యక్షుడు ఐ.బాలకృష్ణ, మండల కార్యనిర్వహ క కార్యదర్శి శ్రీధర్‌బాబు, కార్యదర్శులు కృష్ణయ్య, నారాయణ, శ్రీదేవి , అరుణ, శ్రీనివాసులు పాల్గొన్నారు. 


---------

Updated Date - 2021-04-20T03:45:14+05:30 IST