తెలంగాణ దేవాదాయ శాఖ అర్చక ఉద్యోగులకు పీఆర్సీ వర్తింపు

ABN , First Publish Date - 2021-12-06T20:38:57+05:30 IST

తెలంగాణా రాష్ట్ర దేవాదాయ శాఖ లో పనిచేస్తూ, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అర్చక ఉద్యోగులకు నూతన పీఅర్ సీ.వర్తింప చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీ. ఓ 114 విడుదల చేసింది.

తెలంగాణ దేవాదాయ శాఖ అర్చక ఉద్యోగులకు పీఆర్సీ వర్తింపు

హైదరాబాద్: తెలంగాణా రాష్ట్ర దేవాదాయ శాఖ లో పనిచేస్తూ, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అర్చక ఉద్యోగులకు నూతన పీఅర్ సీ.వర్తింప చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీ. ఓ 114 విడుదల చేసింది. ఈ సందర్భంగా అర్చక ఉద్యోగులు నూతన పీఅర్సీ కి సహకరించిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ అర్చక ఉద్యోగ జేఏసీ కన్వీనర్ డివిఅర్ శర్మ మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియచేశారు. దేవాదాయశాఖలో కట్ ఆఫ్ తేదీ తొలగించి మిగిలిన 1252 మంది తాత్కాలిక అర్చక ఉద్యోగులను కూడా రెగ్యులర్ చెయ్యాలని, వారికి కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ దేవాలయాలు నిరాదరణకు గురి అయ్యాయి. మన తెలంగాణ రాష్ట్రంలో కే సిఅర్ ఆధ్వర్యంలో మన దేవాలయాలు పూర్వ వైభవం సంతరించుకున్నాయని తెలిపారు.


భారత దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అర్చక ఉద్యోగులకు ఇంతటి వేతనాలు లేవు.తెలంగాణ రాష్ట్ర  వార్షిక బడ్జెట్ లో 152 కోట్లు కేటాయించి ప్రభుత్వ సమాన వేతనాలు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా ముఖ్యమంత్రి  కేసీఅర్ ఇస్తున్నారని తెలిపారు. కేసిఆర్ దిశా నిర్దేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బాగా పనించేస్తున్నారని అన్నారు. మన అర్చక వేతన విధానం భారత దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. యాదాద్రి దేవాలయాన్ని 1800 కోట్లతో  దేశం లోనే అత్యున్నత దేవాలయంగా తీర్చి దిద్దుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఉమ్మడి జిల్లా ఉద్యోగ సంఘం అధ్యక్షుడు అద్దంకి కిరణ్ కుమార్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి నరేష్ శర్మ, వరంగల్ జిల్లా ప్రథాన కార్యదర్శి అభిలాష్ శర్మ, భీమన్నశర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-06T20:38:57+05:30 IST