సూది రంధ్రంలో కరోనా యుద్ధవీరులు

ABN , First Publish Date - 2020-05-28T15:49:25+05:30 IST

నగరానికి చెందిన స్వర్ణకారుడు, సూక్ష్మశిల్పి మట్టెవాడ అజయ్‌కుమార్‌ కోవిడ్‌-19 నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులను

సూది రంధ్రంలో కరోనా యుద్ధవీరులు

వరంగల్‌ : నగరానికి చెందిన స్వర్ణకారుడు, సూక్ష్మశిల్పి మట్టెవాడ అజయ్‌కుమార్‌ కోవిడ్‌-19 నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులను ప్రతిబింబిస్తూ సూది రంధ్రంలో అయిదు సూక్ష్మ శిల్పాలను ప్రత్యేకమైనంతో చెక్కి వాటికి రంగులు వేశా డు. కరోనా వైరస్‌ మాస్క్‌ పెట్టుకొని రెండు చేతులు జోడించి డాక్టర్స్‌, నర్స్‌, పోలీసు, పారిశుధ్య కార్మికులకు మొక్కుతున్నట్టు ఈ శిల్పాలను చెక్కాడు.


కరోనా వైర్‌సకు మాస్క్‌, డాక్టర్‌కు పీపీఈ దుస్తులు.. మెడలో స్టెతస్కోప్‌.. చేతికి గ్లౌజులు, నర్సుకు మాస్క్‌.. చేతిలో ఫైల్‌, యూనిఫామ్‌లో ఉన్న పోలీసు.. చేతిలో లాఠీ.. డ్రెస్‌కు మెడల్స్‌, పారిశుధ్య కార్మికుడికి మాస్క్‌.. చేతిలో చీపురు పట్టుకున్నట్లుగా ఈ శిల్పాలను చెక్కారు. మైక్రోస్కోప్‌ ద్వారా చూస్తే చాలా స్పష్టంగా కనిపించేలా వీటిని రూపొందించారు. ఈ శిల్పాల సైజులు 1.20ఎంఎం నుంచి 0.90ఎంఎం వరకు ఎత్తు, 0.36 ఎం నుంచి 0.15ఎంఎం వరకు వెడల్పు ఉన్నాయి. వీటిని 22రోజుల్లో రూపొందించారు.

Updated Date - 2020-05-28T15:49:25+05:30 IST