మర్పడగ క్షేత్రంలో ఆర్ర్ధా మహోత్సవం

ABN , First Publish Date - 2021-10-27T04:56:51+05:30 IST

మండలంలోని మర్పడగ విజయదుర్గాసమేత సంతాన మల్లికార్జునస్వామి క్షేత్రంలో ఆర్ర్ధా మహోత్సవాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు.

మర్పడగ క్షేత్రంలో ఆర్ర్ధా మహోత్సవం
హోమం నిర్వహిస్తున్న రుత్వికులు

కొండపాక, అక్టోబరు 26 : మండలంలోని మర్పడగ విజయదుర్గాసమేత సంతాన మల్లికార్జునస్వామి క్షేత్రంలో ఆర్ర్ధా మహోత్సవాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు. క్షేత్ర నిర్వాహకుడు చెప్పెల హరినాథశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు వివిధ పూజలను చేశారు. స్థాపిత దేవతాహవనం, రుద్రహవనము, పూర్ణాహుతి కార్యక్రమాల అనంతరం అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. ఈ మహోత్సవంలో యాగ నిర్వహణ కమిటీ సభ్యుడు మరియాల రవీందర్‌, మల్లికార్జున్‌, తిరుపతిరెడ్డి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-27T04:56:51+05:30 IST