హమ్మయ్య..దారి దొరికింది..!

ABN , First Publish Date - 2020-10-25T11:01:03+05:30 IST

‘ఆసుపత్రిని చుట్టేసిన చి రు వ్యా పారాలు’ శీర్షికన ఈనెల 21న ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథ నంపై అధికారులు స్పందించారు.

హమ్మయ్య..దారి దొరికింది..!

ఏరియా ఆసుపత్రి ముందు తొలగిన తోపుడు బండ్లు 


కనిగిరి, అక్టోబరు 24 :  ‘ఆసుపత్రిని చుట్టేసిన చి రు వ్యా పారాలు’ శీర్షికన ఈనెల 21న ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథ నంపై అధికారులు స్పందించారు. కలెక్టరేట్‌ అధికారుల ఆదే శాల మేరకు స్థానిక అధికారులు చర్యలకు ఉపక్రమించారు ఆసు పత్రి ప్రధాన  ద్వారం ముందు  చప్టాపై పెద్ద గుంట ఏర్పడింది. దీంతో అంబు లెన్స్‌ ఇతర వాహనాల రాకపోకలకు ఇబ్బంది కరంగా మారింది. దీంతో గేటును మూసి వేశారు. దీనిని అవకాశంగా తీ సుకొని కొందరు చిరు వ్యాపారులు ఏకంగా ప్రధాన ద్వారం ముం దు తోపుడు బండ్లు నిలిపి వ్యాపారాలు సాగిస్తున్నారు. మరో  ద్వా రం గుండా అటు రోగులు, ఆసుపత్రి వా హనాలు వె ళ్లాల్సిన పరి స్థితి ఏ ర్పడింది. దీంతో రోగులు అనేక అవస్థలు పడుతున్నారు. దీ నిపై ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తపై వైద్యాధికారులు శనివారం గేటు ముందు చప్టాపై గుంట ఏర్పడిన భాగాన్ని పూర్తిగా తొల గించి కొత్తగా నిర్మాణాలు చేపడుతున్నారు. 

Updated Date - 2020-10-25T11:01:03+05:30 IST