పకడ్బందీగా కొవిడ్‌ నియంత్రణ చర్యలు : కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-09-18T07:35:28+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ నియంత్రణ చర్యలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ పోలా భాస్కర్‌ తెలి పారు. గు

పకడ్బందీగా కొవిడ్‌ నియంత్రణ చర్యలు : కలెక్టర్‌

ఒంగోలు(కలెక్టరేట్‌), సెప్టెంబరు 17 : జిల్లాలో కొవిడ్‌ నియంత్రణ చర్యలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ పోలా భాస్కర్‌ తెలి పారు. గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాట్లాడుతూ కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ప్రభు త్వ మార్గదర్శకాలను పక్కాగా అమలుచేస్తున్నామని తెలిపారు.


జిల్లాలో 597 కంటైన్మెంట్‌ జోన్లు ఉండగా అందులో 391 జోన్లు ప్రస్తుతం కొనసాగుతున్నాయ ని తెలిపారు. వేలాది మంది హోంక్వారంటైన్‌లో ఉన్నారని, వారి కోసం 30వేల కిట్లు జిల్లావ్యాప్తంగా పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ కాన్ఫరెన్స్‌లో జేసీ టీఎస్‌ చేతన్‌, సబ్‌కలెక్టర్‌ భార్గవ్‌ తేజ్‌, డీఆర్వో వినాయకం, ఆర్డీవోలు ప్రభాకర్‌రెడ్డి, శేషిరెడ్డి, డీసీహెచ్‌ఎస్‌ ఉషారాణి, రిమ్స్‌ సూపరింటెండెంట్‌ శ్రీరాములు, సీపీవో వెంకటేశ్వర్లు, డీపీవో నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-18T07:35:28+05:30 IST