పకడ్బందీగా సర్వే చేపట్టాలి
ABN , First Publish Date - 2021-05-08T05:25:02+05:30 IST
కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆశ కార్య కర్తలకు సూచించారు.
డిచ్పల్లి, మే7 : కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆశ కార్య కర్తలకు సూచించారు. శుక్రవారం ఆయన డిచ్పల్లి మండలం నడిపల్లి, ధర్మారం గ్రామాల్లో సర్వే తీరు ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. కుటుంబాల్లో ఎవరికైనా కరోనా లక్షణా లు కనబడితే సరైన మందులు అందించాలని ఆశాలకు సూచించారు. గ్రామాల్లో కరోనాపై అవగహన కల్పించాలన్నారు. ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటించాలన్నారు.