అర్ణబ్ గోస్వామికి సుప్రీంలో ఊరట
ABN , First Publish Date - 2020-11-28T07:53:53+05:30 IST
సీనియర్ జర్నలిస్టు, రిపబ్లిక్ టీవీ అధినేత అర్ణబ్ గోస్వామికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన అన్వాయ్ నాయక్ అనే ఓ వ్యక్తిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఎఫ్ఐఆర్లో చేసిన ఆరోపణకు ప్రాథమిక సాక్ష్యాధారాలేవీ కనిపించడం లేదని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది
ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఎఫ్ఐఆర్లో లేదన్న బెంచ్
న్యూఢిల్లీ, నవంబరు 27: సీనియర్ జర్నలిస్టు, రిపబ్లిక్ టీవీ అధినేత అర్ణబ్ గోస్వామికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన అన్వాయ్ నాయక్ అనే ఓ వ్యక్తిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఎఫ్ఐఆర్లో చేసిన ఆరోపణకు ప్రాథమిక సాక్ష్యాధారాలేవీ కనిపించడం లేదని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తూ 16 రోజుల కిందట ఇచ్చిన ఉత్తర్వులు కొనసాగుతాయని, ఈ కేసును బాంబే హైకోర్టు పరిష్కరించేదాకా ఆయన బెయిల్పైనే ఉంటారని స్పష్టం చేసింది. ఈ కేసు విషయంలో హైకోర్టును కూడా బెంచ్ తీవ్రంగా తప్పుబట్టింది. రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత కోర్టుదేనని, ఆ పాత్ర తనదేనన్న అంశాన్ని, పరిధిని, విధులను బాంబే హైకోర్టు విస్మరించిందని జస్టిస్ చంద్రచూడ్ ఆక్షేపించారు.