బాలాకోట్ దాడుల గురించి అర్ణబ్కు ముందే తెలుసు
ABN , First Publish Date - 2021-01-17T08:13:10+05:30 IST
నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకునే అత్యంత కీలకాంశాలు రిపబ్లిక్ టీవీ అధినేత అర్ణబ్ గోస్వామికి చాలా ముందుగానే లీకవుతున్నాయని, వీటి ఆధారంగా ఆయన
ముంబై పోలీసుల ఛార్జిషీట్ వెల్లడి
ముంబై, జనవరి 16: నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకునే అత్యంత కీలకాంశాలు రిపబ్లిక్ టీవీ అధినేత అర్ణబ్ గోస్వామికి చాలా ముందుగానే లీకవుతున్నాయని, వీటి ఆధారంగా ఆయన తన చానెల్ రేటింగ్ పెంచుకోడానికి ప్రయత్నిస్తున్నారని ముంబై పోలీసులు ఆరోపించారు. పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత్ బాలాకోట్లోని ఉగ్రస్ధావరాలపై వైమానిక దాడి జరపనుందన్న విష యం అర్ణబ్కు ముందే తెలుసు.
ఈ విషయాన్ని ఆయన 2019 ఫిబ్రవరి 23న టీవీరేటింగ్లను మదింపు వేసే బ్రా డ్కాస్ట్ ఆడియెన్స్ రిసెర్చ్ కౌన్సిల్ (బార్క్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ పార్థో దాస్గుప్తాకు తెలియపర్చారు. అని కోర్టుకు సమర్పించిన ఛార్జిషీటులో పేర్కొన్నారు.