AP News: సామాన్య భక్తులకు దర్శనం సజావుగా సాగేలా ఏర్పాట్లు : మంత్రి కొట్టు

ABN , First Publish Date - 2022-09-30T02:29:30+05:30 IST

Vijayawada: దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ గురువారం ఇంద్రకీలాద్రి దిగువ నుంచి కొండ‌పై వరకు క్యూలైన్‌లలో భక్తులకు ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులను అడిగి ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..‘‘ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. రేపు లలితా త్రిపుర సుందరీ దేవి దర్శనార్ధం భక్తులు అధికంగా వచ్చే అవ

AP News: సామాన్య భక్తులకు దర్శనం సజావుగా సాగేలా ఏర్పాట్లు : మంత్రి కొట్టు

Vijayawada: దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ గురువారం ఇంద్రకీలాద్రి దిగువ నుంచి కొండ‌పై వరకు క్యూలైన్‌లలో భక్తులకు ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులను అడిగి ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..‘‘ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. రేపు లలితా త్రిపుర సుందరీ దేవి దర్శనార్ధం భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గ ఏర్పాట్లు చేశాం. మరో ఆరు రోజులు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేస్తాం. పాస్‌ల కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం. అమ్మవారి‌పై  భక్తితో ప్రతిఒక్కరూ రావాలి..అంతేకాని ఇతరుల పాస్‌లు వాడుకోరాదు. ఉభయదాతలకు అంతరాలయ దర్శనం‌పై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’’ అని మంత్రి చెప్పారు. 

Updated Date - 2022-09-30T02:29:30+05:30 IST