అర్హతలు లేకుండా టెస్ట్లు ముగ్గురి అరెస్టు : సీఐ
ABN , First Publish Date - 2021-05-11T05:55:13+05:30 IST
అర్హతలు లేకుండా టెస్ట్లు ముగ్గురి అరెస్టు : సీఐ
నడికూడ, మే10: అర్హతలు లేకుండా కరోనా టెస్ట్లు, ట్రీట్మెంట్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని సీఐ మహేందర్రెడ్డి హెచ్చరించారు. నడికూడలో అర్హతలు లేకున్నా టెస్ట్లను చేసి, ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.1500 వరకూ వసూలు చేసిన లోకటి నాగేశ్వర్రావు, కట్టగాని నాగరాజులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. రాయపర్తి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రదీప్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.