గంజాయితో ఇద్దరు వ్యక్తుల అరెస్టు
ABN , First Publish Date - 2020-12-04T06:15:27+05:30 IST
ఇసుకతోటలో గంజాయి కలిగి ఉన్న ఒడిశాకు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
ఎంవీపీ కాలనీ, డిసెంబరు 3: ఇసుకతోటలో గంజాయి కలిగి ఉన్న ఒడిశాకు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఇసుకతోటలో గంజాయి రవాణా జరుగుతున్నట్టు సమాచారం అందడంతో బుధవారం రాత్రి ఎంవీపీ జోన్ పోలీసులు, ఎస్ఈబీ సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒడిశాకు చెందిన కూన గురిడి (53), జగన్నాథ్ మండల్ (38)లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 900 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం వారిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్టు సీఐ రమణయ్య తెలిపారు.