మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-07-04T02:55:17+05:30 IST

టీడీపీ నేతలను ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది. మాజీమంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ ఘటన మరువక ముందే మరో నేతను పోలీసులు అరెస్ట్ చేశారు.

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్‌

రాజమండ్రి: టీడీపీ నేతలను ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది. మాజీమంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ ఘటన మరువక ముందే మరో నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తుని మండలం సీతారాంపురం దగ్గర రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ వైపు వెళ్తున్న కొల్లు రవీంద్రను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కొల్లు రవీంద్రను తుని నుంచి విజయవాడకు పోలీసులు తరలించారు. మచిలీపట్నంలో మోకా భాస్కరరావు హత్య కేసులో  కొల్లు రవీంద్ర పేరును పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. 


ఇంతకు ముందు భాస్కర్ రావు హత్య కేసులో విచారణ నిమిత్తం రవీంద్ర ఇంటిని పోలీసులు తనిఖీ చేశారు. రవీంద్ర కోసం పోలీసులు ఆయన ఇంటిని రెండు సార్లు గాలించారు. ఈ సోదాల్లో ఆయన సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. భాస్కర్ రావును మచిలీపట్నం మార్కెట్ యార్డ్‌ సమీపంలో కొందరు దుండగులు అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కొల్లు రవీంద్ర ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.

Updated Date - 2020-07-04T02:55:17+05:30 IST