రియల్ ఎస్టేట్ పేరుతో మోసం చేస్తున్న ముఠా అరెస్ట్
ABN , First Publish Date - 2022-03-08T02:55:03+05:30 IST
రియల్ ఎస్టేట్ పేరుతో అమాయకులను బురిడీ
యాదాద్రి: రియల్ ఎస్టేట్ పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్న ముఠాను భువనగిరి టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. ఈ ముఠా సభ్యులు లాభాలు చూపిస్తామని భారీగా డబ్బులను వసూలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ముఠాలో నలుగురు ముఠా సభ్యులు ఉన్నారన్నారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. పట్టుబడ్డ నిందితుల నుంచి ఇల్లు, నాలుగు ప్లాట్లకు సంబంధించి పత్రాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. అరకిలో బంగారం, కారు, 10 మొబైల్ ఫోన్స్ సీజ్ చేశామన్నారు. పట్టుబడ్డ సొత్తు విలువ సుమారు ఐదు కోట్లు ఉంటుందని డీసీపీ తెలిపారు.