హత్యకేసులో నిందితుల అరెస్టు
ABN , First Publish Date - 2021-02-25T05:11:30+05:30 IST
హత్యకేసులో ఉన్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ విజయకు మార్ పేర్కొన్నారు.
మైదుకూరు, ఫిబ్రవరి 24: హత్యకేసులో ఉన్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ విజయకు మార్ పేర్కొన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ బి.మఠం మండలం ముడమాలలో జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా టీడీపీ నేత బసిరెడ్డి దుగ్గిరెడ్డి, వైసీపీకి చెందిన ముడుమాల భాస్కర్రెడ్డి మధ్య గొడవలున్నాయన్నారు. ఈ నేపధ్యంలో దుగ్గిరెడ్డి రామిరెడ్డి, రమణారెడ్డితో కలిసి ఇనుపరాడ్లు, రాళ్లతో భాస్కర్ రెడ్డిని కొట్టి చంపి పారిపోయారన్నారు. ఈ కేసులో నిందితులు ముగ్గురిని బుధ వారం సిద్దయ్యగారిమఠం క్రాస్ రోడ్డు వద్ద రూరల్ సీఐ కొండారెడ్డి, ఎస్ఐ శ్రీనివా సులు తమ సిబ్బందితో కలసి అరెస్టు చేశారని డీఎస్పీ తెలిపారు. నిందితులను కోర్టుకు హాజరుపెడుతున్నామని ఆయన తెలిపారు.